Monday, April 29, 2024

Bellampalli – పంచాయతీ కార్మికుల అర్థనగ్న ప్రదర్శన…

బెల్లంపల్లి జూలై 12 (ప్రభ న్యూస్) – తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బుధవారం బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామపంచాయతీ కార్మికులు ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. గ్రామపంచాయతీ సిబ్బంది మీ పర్మినెంట్ చేయాలని, పి ఆర్ సి లో నిర్ణయించిన బేసిక్ ప్రకారం 19వేల రూపాయలు వేతనం చెల్లించాలని, కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలని, జిఓ 51 సవరించాలని, విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పలు డిమాండ్లు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మిక సంఘం నాయకులు కొండ గొర్ల శ్రీనివాస్ ,రత్నం శ్రీనివాస్, డోలే మల్లికార్జున్, , కిషోర్, చిలుముల రవి, రామచందర్, తిరుపతి ,శ్రీనివాస్ ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement