Friday, May 17, 2024

Boadh -రేవంత్ రెడ్డి కి బోథ్ లో నిర‌స‌న సెగ

బోథ్ జులై 12 ప్రభ న్యూస్ – ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బి ఆర్ ఎస్ శ్రేణులు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బుధవారం దగ్ధం చేశారు. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వకూడదు అన్న కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి మాటలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామని బిఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ వారికి 24 గంటల పాటు ఉచిత కరెంటును అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రేవంత్ రెడ్డి తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడని పొరపాటున కాంగ్రెస్ వస్తే రైతులకు అధోగతి పడుతుందని కాంగ్రెస్ మాటలకు ఎవ్వరు మోసపోవద్దని తెలంగాణ రైతాంగ సంక్షేమాన్ని కృషి చేస్తున్న కెసిఆర్ కి మద్దతు పలకాలని కోరారు. కాంగ్రెస్ పార్టీల ఊసరవెల్లి రంగులు మార్చే అలవాటు బిఆర్ఎస్కు లేదని ఇప్పటికీ ఏప్పటికీ రైతు పక్షపాతి గానే ఉంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆరెస్ నాయకులు ఎలుక రాజు,సురేందర్ యాదవ్, నారాయణ రెడ్డి, లింభాజీ, రుక్మాన్సింగ్, రమణ గౌడ్, పోశెట్టి,మహమ్మద్ రఫీ, సోమన్న,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement