Monday, May 6, 2024

సీఎం కేసీఆర్ కు బండి సంజ‌య్ బ‌హిరంగ లేఖ

పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ ను అమలు చేయడంతో పాటు వారి సర్వీస్ ను కూడా క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైనదని అన్న ఆయన.. పారిశుధ్యం, హరితహారం, పన్నుల సేకరణ పనులతో పాటు.. దోమల నివారణ చర్యలు కూడా తీసుకునే కార్యదర్శుల సేవలు మరువలేనివన్నారు. గ్రామల అభివృద్ధి కోసం ఇంత కష్టపడుతున్న పంచాయతీ కార్యదర్శులపై నిత్యం అధికార పార్టీ గూండాలు దాడులు చేయడం బాధాకరమన్నారు. అలాగే ఉన్నతాధికారులు కూడా వారిని నిత్యం వేధించడం తగదని బండి సంజయ్ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement