Thursday, April 25, 2024

మహారాష్ట్రలో బర్డ్‌ ఫ్లూ కలకలం..25 వేల కోళ్లను చంపాలని ఆదేశం

మహారాష్ట్రలోని థానేలో జిల్లాలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని వెహ్లోలిలో ఉన్న ఓ కోళ్లఫారంలో సుమారు 100 కోళ్లు ఆకస్మికంగా మృతి చెందాయి. బర్డ్ ఫ్లూ సోకి కోళ్లు మృతి చెందాయన్న అనుమానంతో కోళ్ల నమూనాలను పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. బర్డ్ ఫ్లూ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం చేశారు. వెంటనే ఆ ఫారంలోని కోళ్లను చంపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. వెహ్లోలీ ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న సుమారు 25 వేల కోళ్లను చంపేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. వ్యాధిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో హెచ్‌5ఎన్‌1 ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా కారణంగా పక్షులు చనిపోయాని థానే జడ్పీ సీఈఓ డా. బహుసాహెబ్‌ దంగ్డే వెల్లడించారు. బర్డ్‌ ఫ్లూ కేసులను గుర్తించినట్లు కేంద్ర పశు సంవర్ధక శాఖకు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement