Monday, April 29, 2024

‌కలెక్టర్లతో కాళ్ళు మెక్కించుకునే పరిస్థితి రావడం సిగ్గుచేటు: బండి సంజయ్‌

‌కలెక్టర్‌లతో కాళ్ళు మెక్కించుకునే పరిస్థితి సీఎం కేసీఆర్‌కు రావటం సిగ్గుచేటు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కలెక్టర్ తీరుతో దేశంలోని ఐఏఎస్ అధికారులంతా సిగ్గు పడుతున్నారన్నారు. హుజురాబాద్‌‌లో టీఆర్ఎస్‌‌కు అభ్యర్థి లేరన్నారు. హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బండి సంజయ్ పేర్కొన్నారు. కోట్లు ఖర్చు పెట్టినా టీఆర్‌ఎస్‌కు డిపాజిట్‌ కూడా దక్కదన్నారు. హుజురాబాద్‌లో వార్‌ వన్‌ సైడే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో బండి సంజయ్ పేర్కొన్నారు.

తెలంగాణ నిఖార్సైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్ అని ఎంపీ బండి సంజయ్ అన్నారు. మొండి ధైర్యంతో పని చేసే వ్యక్తి ఈటల అని బండి ప్రశంసించారు నిజమైన ఉద్యమకారులు టీఆరెస్ పార్టీలో ఉండరు, ఉండలేరన్న ఆయన.. టీఆరెస్ లో ఉండలేని నేతలే బీజేపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో మలిదశ ఉద్యమానికి టి- బీజేపీ పురుడు పోస్తదని బండి సంజయ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement