Thursday, May 9, 2024

ప్రేమేంద‌ర్ రెడ్డిని ఓట్ల‌తో అశీర్వ‌దించండి – బండి సంజ‌య్

నల్లగొండ: నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేస్తున్న త‌మ పార్టీ అభ్య‌ర్ధి జి ప్రేమేందర్ రెడ్డిని ఆశీర్వదించాలని గ్రాడ్యుయేట్ ఓట‌ర్ల‌ను బిజెపి తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అభ్య‌ర్ధించారు.. న‌ల్గొండ క‌లెక్ట‌రేట్ లో నేడు ప్రేమేంద‌ర్ రెడ్డి త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారు.. ఈ కార్య‌క్ర‌మంలో బండి సంజ‌య్, న‌ర్శింహులు తదిత‌రులు పాల్గొన్నారు.. అనంత‌రం బండి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షస పాలన, గడీల పాలన కొనసాగుతోందని విమర్శించారు. నీచ రాజకీయాలకు సమాధి కట్టాలన్న టీఆర్‌ఎస్ పార్టీ మెడలు వంచాలన్నా దమ్మున్న బీజేపీని గెలిపించాలని కోరారు. అమరవీరుల రక్తపు మడుగులో అధికారంలోకి వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించకుండా సీఎం ప్రగతి భవన్‌కు పరిమితం అయ్యారని మండిపడ్డారు. ఉపాధ్యాయులను మోసం చేసిందీ ప్రభుత్వమని.. వారి కోసం జైలుకెళ్లిన బీజేపీని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే పీఆర్సీ వస్తుందని తెలిపారు. ఉద్యమాల పురిటిగడ్డగా నిలిచిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల్లో పట్టభద్రులు ఆలోచించాలని అన్నారు. అంత‌కు ముందు బండి సంజ‌య్ నార్కెట్ ప‌ల్లిలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర దేవాలయంలో ప్రత్యక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement