Sunday, May 5, 2024

విజయసారధికి పద్మశ్రీ.. తెలంగాణకు గర్వకారణం

సంస్కృత మహాకవి, గీర్వాణ వాచస్పతి, మహామహోపాధ్యాయ శ్రీ భాష్యం విజయసారథికి పద్మశ్రీ అవార్డు రావడం తెలంగాణ రాష్ట్రానికి, ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాకు గర్వకారణమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. శ్రీ భాష్యం విజయసారధి సాహితీలోకానికి చేసిన విశేష కృషి వెలకట్టలేనిదన్నారు. ఆయన చేసిన సేవలు కృషికి పద్మశ్రీతో సరైన గుర్తింపు లభించిందన్నారు. వ్యాకరణ, జ్యోతిష్య, సాంఖ్య, తర్క, మీమాంసాది శాస్త్రాలలో నిష్ణాతులై, సంస్కృత భాషలో గేయ ఛందస్సు సృష్టించి, మందాకినీ వంటి ఎన్నో మహాకావ్యాలను రచించిన మహాకవి శ్రీభాష్యం విజయసారథి అని కొనియాడారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న శుభ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు  తెలియజేస్తున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement