Thursday, May 2, 2024

KNR: శివాలయాన్ని శుద్ధిచేసిన బండి సంజయ్..

కరీంనగర్ పద్మానగర్ లోని శివాలయంను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇవాళ ఉదయం శుద్ధిచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈనెల 22న రామ మందిర పున:ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందన్నారు. ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు దేవాలయాల శుద్ది చేస్తున్నామన్నారు.


ఈరోజు కరీంనగర్ లోని పద్మానగర్ శివాలయాన్ని శుద్ది చేయడం సంతోషంగా వుందన్నారు. దేవుడి అక్షింతల్లో రేషన్ బియ్యం, బాసుమతి, జై శ్రీరామ్ అక్షింతలు వుంటాయా అని ప్రశ్నించారు. దేవుడి అక్షింతలను రాజకీయం చేయడం తగదన్నారు బండి సంజయ్ కుమార్.

Advertisement

తాజా వార్తలు

Advertisement