Sunday, May 5, 2024

Tammineni వీరభద్రంను పరామర్శించిన డిప్యూటీ సీఎం

లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం భ‌ట్టివిక్ర‌మార్క‌, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప‌రామ‌ర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

మెరుగైన వైద్య సేవలు అందించి త్వరగా కోలుకునేలా కృషి చేయాలని డాక్టర్లకు సూచించారు. తమ్మినేని వీరభద్రం సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement