Sunday, April 28, 2024

YS Sharmila : ఈనెల 21న పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ ష‌ర్మిల‌ బాధ్యతల స్వీకరణ

ఏపీలో వైఎస్ షర్మిల పొలిటికల్ ఎంట్రీకి ముహుర్తం ఖరారైంది. ఈనెల 21వ తేదీ ఉదయం 11గంటలకు పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకాన్ని ఇప్పటికే ఏఐసీసీ ప్రకటించగా కుమారుడి వివాహం నేపథ్యంలో 21న ఆమె బాధ్యతలు చేపడతారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ సమక్షంలో షర్మిల బాధ్యతలు చేపడతారు.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఎలాంటి ప్రభావం చూపిస్తారనే చర్చ మొదలైంది. ఇడుపులపాయలో తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి చెంత ఆమె పీసీసీ పగ్గాలు చేపడతారని సమాచారం. వైఎస్‌ అనుచరులు, అభిమానులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని ఆమెకు మద్దతు పలుకనున్నారు. బాధ్యతల స్వీకరణ సమయంలోనే ఇడుపులపాయ వేదికగా రాజకీయంగా షర్మిల బల ప్రదర్శనకు సిద్దమవుతున్నారు. భారీగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రమాణ స్వీకార వేళ తరలి వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement