Wednesday, May 1, 2024

Nomination: ఇవాళ ఎమ్మెల్సీ నామినేష‌న్ వేయ‌నున్న బ‌ల్మూరి, మ‌హేష్‌

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు మ‌హేష్‌ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌లు నామినేష‌న్ వేయ‌నున్నారు. ఇవాళ‌ తమ నామినేష‌న్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు. ఈ రెండు కూడా ఉపఎన్నికలు కావడంతో శాసనసభలో అత్యధిక స్థానాలు కలిగిన కాంగ్రెస్ పార్టీకి రెండు ఎమ్మెల్సీలు దక్కనున్నాయి.

మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్‌ జారీకాగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల స్వీకరణకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. ఈ నెల 19న నామపత్రాల పరిశీలన, 22 వరకు ఉపసంహరణ ప్రక్రియ 29న ఎన్నికలు జరగనున్నాయి. 29 సాయంత్రమే ఫలితాలు వెల్లడికానున్నాయి. వీరు పోటీ చేయనున్న ఎమ్మెల్సీల గడువు 2027 నవంబర్ 30వ తేదీ వరకు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement