Sunday, April 28, 2024

TS : పంట పొలాల్లో పసికందు….

రోజురోజుకు మాన‌వ‌త్వం మంట‌గ‌లుస్తుంది. వమాసాలు మోసి కడకు పుట్టిన పసికందును తల్లి ప్రేమ రుచిచూడక ముందే త‌న‌ను వ‌దులుకుంది. ఏ తల్లికి పుట్టిన బిడ్డ భారమయ్యిందో తెలియదు గాని పంట‌పొలాల్లో ప్రాణం ఉండగానే విడిచి పెట్టింది. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండ‌లం నీప‌ని గ్రామంలో చోటుచేసుకుంది.

- Advertisement -

గ్రామంలోని గంగ‌మ్మ అనే మ‌హిళ ఈ ఉద‌యం పంట చేను వైపు వెళ్లింది. అక్క‌డ ప‌సికందు ఏడుపు వినిపించింది. ఏవ‌రా అని వెత‌క సాగ‌గా తీర పంట చేనులో ప‌సికందు క‌నిపించింది. ఎవ‌రో ప‌సికందును ఇక్క‌డ వ‌దిలేసి ఉంటార‌ని ఆ బిడ్డ‌ను త‌న ఇంటికి తీసుక‌వ‌చ్చింది. ఈ విషయాన్ని గ్రామ‌స్తుల‌కు తెలిపింది. వెంట‌నే గ్రామ‌స్తులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. గ్రామ‌స్తుల ఫిర్యాదు మేర‌కు ఎస్సై ప్ర‌దీప్‌కుమార్ కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌సికందు గంగ‌మ్మ వ‌ద్దే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement