Thursday, May 9, 2024

అయ్యప్ప స్వామి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి – మంత్రి

వేల్పూర్ సెప్టెంబర్ 10 ( ప్రభ న్యూస్ ) – వేల్పూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయ ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రికి అర్చుకులు,అయ్యప్ప స్వాములు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అక్కడే ఏర్పాటు చేసిన శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అయ్యప్ప స్వామి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రి ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, రైతు నాయకుడు కోటపాటి నర్సింహాయుడు,ఎంపీపీ బీమా జామున, సర్పంచి తీగల రాధ మోహన్,భారస నాయకులు రేగుల్ల రాములు, నాగధర్ రెడ్డి, మోహన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు,అయ్యప్ప భక్తులు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement