Saturday, April 27, 2024

యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. పట్టపగలే ఆటో డ్రైవర్ యువతిపై అత్యాచారం చేశాడు. ఆటో ఎక్కిన యువతిని దారి మళ్లించి నిర్మాణుష్య ప్రదేశంలోొకి తీసుకెళ్లి యువతిపై దారుణానికి ఒడిగట్టాడు. సంతోష్‌నగర్‌లో నివసిస్తున్న 20 ఏళ్ల యువతి మైలార్‌దేవ్‌పల్లిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. నిన్న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో విధులకు బయలుదేరిన ఆమె ఆటో ఎక్కింది. కొంతదూరం వెళ్లాక ఆటోను దారి మళ్లించిన డ్రైవర్ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న యువతిని అక్కడే వదిలేసి పరారయ్యాడు.

యువతి సాయంత్రం సమయంలో తేరుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. తనపై జరిగిన ఘోరంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇంకా షాక్‌లోనే ఉండడంతో పూర్తి వివరాలు చెప్పలేకపోతోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటోడ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కోహ్లీ అందుకే విఫలమవుతున్నాడు: సచిన్

Advertisement

తాజా వార్తలు

Advertisement