Monday, April 29, 2024

ఆటో,కారు ఢీ : ఒక‌రు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

సిద్దిపేట జిల్లా కోడకండ్ల గ్రామంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఆటో-కారు ఢీకొన్న ప్ర‌మాదంలో ఒక‌రు మృతిచెంద‌గా.. మ‌రో ఏడుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ప్ర‌మాద ఘ‌ట‌న విష‌యం పోలీసుల‌కు తెలిసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈప్ర‌మాదంలో మృతురాలిని వి.నాగ‌మ‌ణి(50)గా పోలీసులు గుర్తించారు. బాధితులంతా ఆందోల్ మండ‌లం సాయిబాన్‌పేట్‌కు చెందిన‌వారని, వీరంతా కొముర‌వెల్లి మ‌ల్ల‌న్నను ద‌ర్శించుకొని తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు నిర్ధారించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement