Thursday, April 25, 2024

నెల్లూరు జిల్లాలో కిడ్నాపైన‌ బాలిక క్షేమం.. పోలీసుల అదుపులో నిందితులు..

నెల్లూరు జిల్లాలో నిన్న కిడ్నాప్‌కు గురైన గిరిజ‌న బాలిక సేఫ్‌గానే ఉంది. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ఎంక్వైరీ స్పీడ‌ప్ చేసిన పోలీసులు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలోని చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద మూడు సంవత్సరాల చిన్నారి ఆదివారం కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే. కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాలిక క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement