Saturday, April 27, 2024

నిధులు ఇవ్వండి: సీఎం జగన్ కు కడప మేయర్ లేఖ

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కడప మేయర్ సురేష్‌ బాబు లేఖ రాశారు. కడప నగరపాలక సంస్థలో రోడ్ల విస్తరణకు నిధులు ఇవ్వాలని లేఖలో కోరారు. కడపలో ట్రాఫిక్ సమస్య ఎక్కువైనందున నభీకోట నుంచి రవీంద్రనగర్​కు వెళ్లే ప్రధాన రహదారిని విస్తరించాలని తెలిపారు. దీంతో కడప నుంచి ప్రొద్దుటూరు, రాయచోటి, పులివెందులకు వెళ్లే బస్సులను దారి మళ్లించే అవకాశం ఉందని చెప్పారు. రహదారి విస్తరణ సమయంలో కొత్త రోడ్డు వేయడానికి, కట్టడాలు తొలగించండం.. బాధితులకు పరిహారం ఇవ్వడానికి మొత్తం రూ.14.20 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఆ నిధులను మంజూరు చేయాలని సీఎం జగన్ ను లేఖలో కడప మేయర్‌ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement