Thursday, April 18, 2024

అభివృద్ధిలో భాగస్వాముల కావాలని ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి పిలుపు

భువనగిరి, (ప్రభ న్యూస్) : భువనగిరి నియోజకవర్గంలో అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామలుగా తీర్చిదిద్దాలని, అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని అనాజీపురం గ్రామంలో పల్లె పర్యవేక్షణ కార్యక్రమంలో గ్రామంలో గడప గడపకు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలతో కలసి కలియ తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చించారు. భువనగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎదునూరి ప్రేమలత మల్లేష్, ఎంపీటీసీ గునుగుంట్ల కల్పన శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేష్ గౌడ్, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి, జడ్పీటీసీ సుబ్బురు బీరుమలయ్య, పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ కంచి మల్లయ్య, తెరాస నాయకులు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, అబ్బగాని వెంకట్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement