Wednesday, May 15, 2024

ఎమ్మెల్యే ఫామ్‌హౌజ్‌లో దారుణం.. ఇద్దరు మృతి

ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫామ్‌హౌజ్‌లో దారుణం చోటు చేసుకుంది.శుక్రవారం నిజామాబాద్ జిల్లా నవీపేట్‌ మండలం జన్నేపల్లిలోని మైనంపల్లి గెస్ట్‌హౌజ్‌లో మరమత్తులు చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు.రెండో అంతస్తులో గోడ కూలుస్తూ కిందపడి ఒకరు మృతిచెందగా తోటి కార్మికుడు కిందపడటం చూసి గుండెపోటుతో మృతిచెందారు.స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపడుతున్నారు.కార్మికులు నిజామాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement