Saturday, May 4, 2024

WGL: బాలాజీ హాస్పిటల్ లో దారుణం.. అధిక మ‌త్తుమందు ఇవ్వ‌డంతో మృతి

అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన వృద్ధురాలికి అధికంగా మ‌త్తు మందు ఇవ్వ‌డంతో మృతిచెంది. ఈ దారుణ ఘ‌ట‌న వ‌రంగ‌ల్‌లో చోటుచేసుకుంది. మ‌ద్దిరాల ప్రాంతానికి చెందిన రాపక బద్రమ్మ అనే వృద్ధురాలు కాలు విరిగడంతో చికిత్స కోసం ఈనెల 21న బాలాజీ ఆసుప‌త్రిలో చేరింది.

ఆమెకు డాక్ట‌ర్లు చికిత్స నిర్వ‌హించారు. నొప్పి భ‌రించ‌డం లేద‌ని మూడు రోజుల నుంచి మ‌త్తు మందు ఇస్తుండ‌డంతో వృద్ధురాలు కోమాలోకి వెళ్లిపోయింది. ఈ క్ర‌మంలో ఆమెకు మ‌త్తు మందు అధికంగా ఇస్తుండ‌డంతో ఇవాళ ఉద‌యం మృతి చెందింది. దీంతో ఆసుప‌త్రి ముందు బంధ‌వులు ఆందోళ‌నకు దిగారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement