Friday, May 3, 2024

Kharge: హైద‌రాబాద్‌కు ఖ‌ర్గే..బూత్ కన్వీనర్లతో స‌మావేశం

హైద‌రాబాద్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవాళ రానున్నారు. ఎల్బీస్టేడియంలో నిర్వ‌హించే కాంగ్రెస్ బూత్ లెవ‌ల్ ఏజెంట్ల స‌మావేశంలో పాల్గొన‌నున్నారు. ఈమేర‌కు మీటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లపై సీఎం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలే ఎజెండాగా బూత్ కన్వీనర్లతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమావేశం కానున్నారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల గెలుపులో బీఎల్ఏలు కీలకపాత్ర పోషించారు.. అలాగే, పార్లమెంట్​ ఎన్నికల్లోనూ అలాంటి పని తీరును కనబరిచేందుకు ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement