Wednesday, May 1, 2024

France President: భారత్‌కు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు.. మోదీతో రోడ్‌షో…

ఇవాళ ప్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్ భార‌త్‌కు రానున్నారు. భార‌త గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌కానున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా మాక్రాన్‌ నేడు భారత్‌కు చేరుకుంటారు.ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇక, ఆ తర్వాత మోడీతో కలిసి మాక్రాన్‌ జైపూర్‌లోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటన తర్వాత మాక్రాన్‌ నేటి రాత్రికి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు. అలాగే, రేపు (జనవరి 26వ) జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.


జైపూర్‌లో ఇద్దరు నేతలు రోడ్‌ షో నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సంబంధిత అధికారవర్గాలు వెల్లడించాయి.
ఈ పర్యటన తర్వాత మాక్రాన్‌ గురువారం రాత్రికి దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. జనవరి 26వ తేదన జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమంలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement