Monday, April 29, 2024

Assembly – మరి కొద్దిసేపట్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మరి కొద్దిసేపట్లో నాలుగవ రోజు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ మొదలవగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరుగనుంది.

కొత్త అసెంబ్లీ కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 9న సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించనుండగా.. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద బలపర్చనున్నారు. మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా.. టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరచనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement