Friday, May 3, 2024

అధికార లాంఛనాలతో ఏఎఎస్సై అంత్యక్రియలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీస్ స్టేషన్లలో ఏఎస్సై గా విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హరిలాల్ నాయక్ పార్థివదేహానికి జిల్లా ఇంచార్జి ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జి పాటిల్ నివాళులర్పించారు. హరిలాల్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసుల గౌరవవందనం, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలం గాంధీ నగర్ శివారులో జాతీయ రహదారిపై ఆగివున్న ఇసుక లారీని ఆదివారం(నవంబర్ 07) తెల్లవారుజామున పోలీస్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో రేగొండ ఏఏసై హరిలాల్ నాయక్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. హరిలాల్ విధి నిర్వహణలో అంకిత భావంతో విధులు నిర్వహించే పోలీసులు తెలిపారు. ఆయన కుటుంబానికి పోలీస్ శాఖ సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ శ్రీనివాసులు, వరంగల్ ఏసీపీ గిరికుమార్ భూపాల్పల్లి డీఎస్పీ సంపత్ రావు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement