Tuesday, May 7, 2024

WGL: వీడిన మర్డర్ మిస్టరీ…ఇద్దరి నిందితుల అరెస్ట్

వరంగల్ క్రైమ్, ఆగస్టు 29 (ప్రభ న్యూస్) : వరంగల్ నగరంలోని ఎస్ఆర్ఆర్ తోటలో జరిగిన 70ఏళ్ళ రామచందర్ మర్డర్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈనెల 23న ఉదయం 11గంటల ప్రాంతంలోనే రాంచందర్ ను
గొంతు కోసి దారుణంగా హత్య చేసిన విషయం విదితమే.


ఈకేసులో నింధితులైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎం ఏ బారి విలేకరుల సమావేశంలో తెలిపారు. మృతుడైన రామచందర్ కొడుకు త్రిలోక్ చందర్ తన అక్కయ్య అరుణను వివాహం చేసుకొని కొంతకాలం కాపురం చేశాక, అనారోగ్య సమస్యలను సాకుగా చూపి విడాకులు పొందాడు. వారిద్దరి వల్లే తన అక్కయ్య లైఫ్ స్పైల్ అయిందని కక్ష్య పెంచుకొని సాపూర్ అనిల్ కత్తితో గొంతుకోసి హత్య చేసినట్టు గుర్తించారు. ఈ విలేకరుల సమావేశంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ అలిగేటి మధుసూదన్, వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement