Friday, May 17, 2024

ADB: ఖానాపూర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా… జాన్సన్ నాయక్

జన్నారం, ఆగస్టు 29 (ప్రభ న్యూస్): ఖానాపూర్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని పైడిపల్లి ఫంక్షన్ హాల్లో మంగళవారం పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. తాను ప్రజాసేవకే పార్టీలోకి వచ్చానని, తనకు పార్టీలోని వారందరూ సమానమేనని, తనను రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి గెలిపించినట్లయితే తాను సేవకునిగా పనిచేస్తానని ఆయన తెలిపారు.

ప్రతి పల్లెలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని తీర్చడానికి కృషి చేస్తానన్నారు. పార్టీ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తారని ఆయన చెప్పారు. అటు ఖానాపూర్ ను రెవెన్యూ డివిజన్, ఇటు పోనకల్ ను మున్సిపాలిటీ గాను చేయడానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ముందుగా ఆయన మండలంలోని ఇంధన్ పల్లి గ్రామ సమీపంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. సమావేశానంతరం మండలంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలచే వేరువేరుగా మాట్లాడుతూ… సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు పైడిపల్లి రవీందర్రావు, లోక భూమి రెడ్డి, జన్నారం, కడెం ఎంపీపీలు సరోజన రవీందర్రావు, అలెగ్జాండర్ జెడ్పిటిసి చంద్రశేఖర్, పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజారాం రెడ్డి, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement