Monday, May 13, 2024

టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్ నియామకం

తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసన సభ్యులు బాల్కసుమన్ కు అప్పగించారు. తెరాస మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ నియామకపు ఉత్తర్వులు బుధవారం జారీ చేశారు. బాల్క సుమన్ ఉస్మానియా విద్యార్థి నేతగా, టీఆర్ఎస్ వీ రాష్ట్ర అధ్యక్షునిగా, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా బాధ్యతలు అప్పగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement