Wednesday, May 15, 2024

Breaking: తెలంగాణ‌లో మ‌రో సంస్థ‌ భారీ పెట్టుబ‌డులు.. 700 కోట్ల‌తో ఎల‌క్ట్రానిక్స్ మోడ్యుల్స్ త‌యారీ

తెలంగాణ‌కు మ‌రో భారీ సంస్థ రాబోతోంది. 700 కోట్ల రూపాయ‌ల‌తో ఎల‌క్ట్రానిక్స్ మోడ్యుల్స్ త‌యారీ చేసేందుకు ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేర‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా వివ‌రాలు షేర్ చేశారు.

ప్రీమియర్ ఎనర్జీ గ్రూప్ & అజూర్ పవర్ మధ్య మంత్రి కేటీఆర్ వ్యూహాత్మక కూటమిని రూపొందించారు.1.25 GW సోలార్ సెల్ & 1.25 GW సోలార్ మాడ్యూల్ సదుపాయాన్ని ఏర్పాటు చేయ‌డానికి ఈ సంస్థ ముందుకు వ‌చ్చింది.

దీని ద్వారా 1000 మందికి ప్రత్యక్ష ఉపాధిని, 2000 మందికి ప‌రోక్ష ఉద్యోగాలను క‌ల్పించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇదంతా స్థానిక యువ‌త‌కు ఉపాధిని కల్పించడానికి రూ. 700 కోట్ల పెట్టుబడి పెడుతున్న‌ట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement