Friday, April 26, 2024

అంజన్న ఔదార్యం.. యుద్ధ ప్రతిపాదికన గుంతల పూడ్చివేత

షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ ముఖ్య కూడలిలో గుంతలు ఏర్పడి కొంతకాలంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొత్తూరు నుండి అన్నారం జంక్షన్ వరకు నాలుగు లైన్ల రహదారి వస్తుండడంతో పనులు జరిగేందుకు కొంత సమయం ఉంది. ఈ నేపథ్యంలో గుంతలు ఉన్నందున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకొని యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా తాత్కాలిక మరమ్మత్తు పనులు ఆదివారం చేపట్టారు. షాద్ నగర్ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్ ఆధ్వర్యంలో టాఆర్ ఎస్ నాయకులు చీపిరి రవి యాదవ్, గుండు అశోక్, శీలం శ్రీకాంత్ మరమ్మతు పనులను దగ్గరుండి పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement