Sunday, April 28, 2024

Peddapalli : అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. ఎంపీ వెంకటేష్ నేత

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలని పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత తెలియజేశారు. ఇవాళ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ గ్రామ పంచాయతీలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… సమాజంలో అంబేద్కర్ భావజాలాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే బాధ్యత అంబేద్కరిస్టులపై ఉన్నదని, అంబేద్కర్ ఐడియాలజీని ప్రతి ఒక్క పౌరునికి చేరే విధంగా దళిత బహుజన సంఘాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు గోమాస శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ రాజు, నాగరాజు, శ్రీపతి, డాక్టర్ నీలకంఠేశ్వర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement