Wednesday, May 1, 2024

TS: మూడు విప్లవ పార్టీలు విలీనం.. సీపీఐ ఎంఎల్ నాయకుల వెల్లడి..

మూడు విప్లవ పార్టీలైన సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ (ఎంఎల్) ఆర్ఐ, పీసీసీ సీపీఐ (ఎంఎల్) పార్టీలను విలీనం చేసి నూతనంగా మాస్ లైన్ ఆల్ ఇండియా పార్టీ ఆవిర్భావం చేసినట్లు సిపిఐ ప్రజాపంథా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు వెల్లడించారు. హైదరాబాద్ పట్టణంలోని మార్క్స్ భవన్ లో విప్లవ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో భారీ ర్యాలీ, బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ కార్యదర్శి సదానందం, కేజీ రామచందర్, రమా, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, రాయల చంద్రశేఖర్, రంగారెడ్డి హనుమేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement