Thursday, May 2, 2024

MBNR: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి… మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 23(ప్రభ న్యూస్): ప్ర‌జ‌ల‌తా సుఖ‌శాంతుల‌తో ఉండాలని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని, రాష్ట్ర ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని వేడుకున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కమలా గార్డెన్స్, ఎర్ర సత్యం చైరస్తా, క్లాక్ టవర్ వద్ద ప్రతిష్టించిన వినాయక మండపాల వద్ద గణేష్ పూజల్లో పాల్గొన్న మంత్రి అక్కడ అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏటా వినాయక చవితి పండుగ అత్యంత వైభవంగా జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ఏటా వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చవితి సందర్భంగా జరిగే ఏర్పాట్ల సమావేశాల నిర్వహణకు కూడా ఇబ్బందులు ఉండేవని… తాము రూ.50లక్షలతో తెలంగాణ చౌరస్తా సమీపంలో రూ.50 లక్షలతో గణేష్ భవన్ ను నిర్మింపచేసి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి గణేష్ మనదే కావడం విశేషమన్నారు. గణేష్ ఉత్సవాలను కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలసి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. వినాయక నిమజ్జనానికి కూడా భారీగా ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ షబ్బీర్, కౌన్సిలర్లు కిషోర్, రామ్ లక్ష్మణ్, నాయకులు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement