Sunday, May 5, 2024

ఆర్యవైశ్యులంతా ఒకే తాటిపై ఉండాలి.. కార్పొరేషన్ చైర్మన్లు కోలేటి, అమరావది

ఆర్యవైశ్యులు అందరూ ఒకే తాటిపై గా ఉండాలని రాష్ట్ర పోలీసు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఆర్య వైశ్య భవన్ లో పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ వైశ్యులు అందరూ ఐక్యంగా ఉంటే అన్ని రంగాల్లో రాణించవచ్చన్నారు.

ఆర్య వైశ్యులు అంటే చులకనగా చూసేవారని, అన్ని రంగాల్లో ముందంజలో ఉంటున్నామన్నారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా కోలేటి రమేష్, యువజన అధ్యక్షుడిగా పెద్ది వెంకటేశ్ లచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో మహాసభ నాయకులు, ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement