Monday, May 6, 2024

TS: కేసీఆర్ ఫోటోతో గెలిచి.. ఇప్పుడు ఆరోపణలా.. ఈటలపై గంగుల ధ్వజం

సీఎం కేసీఆర్ ఫోటోతో గెలిచి… ఏళ్ళ తరబడి పదవులు అనుభవించిన ఈటెల ఇప్పుడు కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఫోటో లేకుండా గెలువగలవా అంటూ ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. మంగళవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ ను గెలిపించాలన్నారు. కేసీఆర్ పాలనలో లా అండ్ ఆర్డర్ భేషుగ్గా ఉందన్నారు. శాంతి భద్రతలు ఉన్న చోటే అభివృద్ధి జరుగుతుందని, కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ క్షేమంగా ఉంటుందన్నారు.

అభివృద్ధి… ఆహ్లాదం… ఆధ్యాత్మికానికి మారుపేరు కరీంనగర్ అని.. మీ ఆకాంక్ష మేరకు అభివృద్ధి చేశాన్నారు. ఇంకా చేయాల్సి ఉంది.. సమస్యలు చూసి పారిపోలేదు… పోరాటం చేశానని, మరోసారి అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్… మంత్రి కేటీఆర్ ల ఆశీర్వాదంతో 4వ సారి బరిలో దిగుతున్న తనను ఆశీర్వదించండని కోరారు. హైదరాబాద్ తర్వాత గొప్పగా అభివృద్ధి చేస్తానని అన్నారు. బుధవారం 10 గంటలకు ప్రజా ఆశీర్వాద సభ కరీంనగర్ లో ఉందని, ఈ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటున్నారని నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆశీర్వదించండని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement