Tuesday, April 30, 2024

వైకుంఠ దామం ప్రారంభం.. ఎంపీపీ గోమాస శ్రీనివాస్

బెల్లంపల్లి : సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పల్లెలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌లు అన్నారు. మండలంలోని మాల గురిజాల, గురిజాల, పెర్కపల్లి, లంబాడితండాలలోని వైకుంఠ దామాలు, కంపోస్టు షెడ్లు, ప్రకృతి వనాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలతో పల్లెలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని, వైకుంఠదామాలు, డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గురిజాల ఎంపీటీసీ కలాలి శకుంతల-వెంకటేష్‌, ఎంపీడీఓ విజయలక్ష్మీ, సర్పంచులు గాజుల రంజిత-వెంకటేష్‌గౌడ్‌, వెంకటేష్‌గౌడ్‌, గోమాస అశోక్‌, రామగోని పద్మావతి, గుర్రాల రాజమల్లు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సింగం గణేష్ ‌గౌడ్‌, ఎంపీఓ శ్రీనివాస్‌, ఏపిఓ జీనత్‌, నాయకులు వెంబడి సురేష్‌, పాయవేని మల్లేష్‌, కందుల ముకుందం, రంగ మల్లేష్‌, లంబాడితండా ఉప సర్పంచ్‌ కందుల శశిరేఖ, వార్డు సభ్యులు కృష్ణ, రాజేశ్వరి, కోఆప్షన్‌ సభ్యులు శ్రీనివాస్‌, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement