Sunday, April 28, 2024

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

బెల్లంపల్లి : కాసిపేట మండలంలో అప్పుల బాధతో కౌలు రైతు తన భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి గడ్డం వినోద్‌ బాధిత కుటుంబసభ్యుల ఇంటికి వెళ్లి కుటుంబ పెద్దలను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. తెరాస ప్రభుత్వం కౌలు రైతులకు చాలా అన్యాయం చేస్తుందని అన్నారు. ఇక నుండి బెల్లంపల్లిలోని అందరికి అందుబాటులో ఉంటూ తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బెల్లంపల్లి అభివృద్ధి కోసం పాటుపడుతానని అన్నారు. ఆయన వెంట మాజీ జెడ్‌పీటీసీ కారుకూరి రాంచందర్‌, మంచిర్యాల జిల్లా జనరల్‌ సెక్రటరి రత్నం ప్రథీప్‌, రామగిరి శ్రీనివాస్‌, దాసరి ప్రతాప్‌, హరీష్‌, అప్పని ప్రభాకర్‌, పుత్తూరి సత్తయ్య, శేఖర్‌రావు, మహంకాళి, జాడి శంకర్‌, దుగుట భరత్‌, గోనె భరత్‌, గోనె రాజన్న, మహేష్‌, ఆనంద్‌, గద్దల ప్రథీప్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement