Monday, April 29, 2024

Adilabad | రన్నింగ్​లో ఉన్న రైలులో నుంచి కింద‌పడ్డ యువతి.. తప్పిన ముప్పు!

తాంసి (ప్ర‌భ న్యూస్‌): ప్రయాణంలో ఉండగా రైల్లో నుంచి ఓ యువతి కింద ప‌డిపోయింది. ఈ ఘటన ఆదిలాబాద్​ జిల్లా తాంసి మండలం ఇవ్వాల (సోమవారం) సాయంత్రం జరిగింది. పొన్నారి గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బేల మండలంలోని జూనోని గ్రామానికి చెందిన పెటుకులే స్నేహ (20), ఆదిలాబాద్ నుంచి వెళ్తున్న నంది గ్రామ్ ఎక్స్​ప్రెస్​లో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో రైల్ లోని తలుపు వద్ద నిలుచుని ఉండగా ఒక్కసారిగా యువతికి తల తిప్పడంతో చెక్కర వచ్చి కింద పడిపోయింది. ఇది గమనించిన అక్కడున్నవారు హుటాహుటిన అంబులెన్స్ లో రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement