Monday, April 29, 2024

Tirumala | ఈసారి ఇదే ప్రత్యేకత.. ఒకేసారి శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ఈసారి ఎంతో విశిష్ఠత ఉందని ఈవో ధర్మారెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సోమవారం సమీక్ష నిర్వహించారు. అధికమాసం సందర్భంగా వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఒకేసారి నిర్వహించనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహనం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్​ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు.

రెండుస్లారు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామన్నారు. స్వయంగా వచ్చే ప్రముఖలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. గరుడసేవకు వచ్చే ప్రతి ఒక్కరూ వాహనసేవను తిలకించేలా ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement