Tuesday, May 14, 2024

చికిత్స పొందుతూ బాలుడు మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ.. నగరంలోని మంచిర్యాల్ చౌరస్తా సమీపంలోని సందీప్ పిల్లల హాస్పిటల్ ఎదుట మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. సుభాష్ నగర్ చెందిన నీలి మల్లేశం కుమారుడు శైలేష్ (9) తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో గురువారం సందీప్ ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ డెంగ్యూ జ్వరంగా నిర్ధారించి ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అయితే ఈరోజు ఉదయం ఇంజక్షన్ వేసిన తర్వాత బాలుడికి స్పృహ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అప్పటికే శైలేష్ మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది నిర్ధారించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు వైద్యుల నిర్లక్ష్య కారణంగానే బాలుడు మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement