Sunday, April 28, 2024

ఎడ్ల బండిని ఢీ కొట్టిన బైక్.. రైతు మృతి

నిర్మల్ జిల్లాలో ఘోరరోడ్డుప్రమాదం జరిగింది. కుభీర్ మండలం సోనారి గ్రామానికి చెందిన రైతన్న ఒకరు రోడ్డు ప్రమాదంలో చని పోయారు. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన దొడ్డికింది వెంగళరావ్ (40) ద్విచక్ర వాహనంపై తమ సమీప వ్యక్తిని మాలేగాం గ్రామంలో దింపివేసి స్వగ్రామానికి తిరిగి వెలుతుండగా ప్రమాదం బారిన పడ్డారు.

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంగళరావ్ భారీ వర్షం కారణంగా మార్గం సక్రమంగా కనిపించక అంతర్ని గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఎడ్ల బండిని ఢీకొట్టుకోవడంతో ప్రమాద చోటు చేసుకుంది. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రుడిని గుర్తించిన గ్రామస్తులు హుటహూటిన భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement