Friday, May 10, 2024

ఎడ్లబండితో ద్విచక్ర వాహనం ఢీ – రైతు మృతి

నిర్మల్ జిల్లా – కుభీర్ మండలం సోనారి గ్రామానికి చెందిన రైతన్న ఒకరు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన దొడ్డికింది వెంగళరావ్ (40) అనే రైతు ద్విచక్ర వాహనంపై తమ సమీప వ్యక్తిని మాలేగాం గ్రామంలో దింపివేసి స్వగ్రామానికి తిరిగి వెలుతుండగా ప్రమాదం బారిన పడ్డారు.

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంగళరావ్​ భారీ వర్షం కారణంగా మార్గం సక్రమంగా కనిపించక అంతర్ని గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఎడ్ల బండి ఢీకొట్టు కోవడంతో ప్రమాద చోటు చేసుకుంది. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రుడిని గుర్తించిన గ్రామస్తులు హుటహూటిన భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.

మృతునికి భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే అమెరికాలోనున్న కుమారుడు నితిన్ వచ్చేంత వరకు అంత్యక్రియలు నిర్వహించకూడదని కుటుంబీకులు నిర్ణయించారు. మృతదేహాన్ని బైంసా ఏరియా ఆసుపత్రిలోని మార్చురీ గదిలో భద్రపరిచారు. శుక్రవారం అమెరికాలోనున్న నితిన్ స్వగ్రామానికి చేరుకున్న అనంతరం అంత్యక్రియలు జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement