Friday, May 3, 2024

జిల్లా సర్పంచ్‌ ల సంఘం అధ్యక్షుడిగా శంకర్..

కాసిపేట : మండలం సోమగూడెం (కె) గ్రామ పంచాయతీ సర్పంచ్‌ సపాట్‌ శంకర్‌ జిల్లా సర్పంచ్‌ ల సంఘంఅధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మంచిర్యాలలో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌ లు మద్దతు తెలిపి జిల్లా కమిటి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాష్ట్ర సంఘం అధ్యక్షులు వెంకటేశ్‌ యాదవ్‌ నియామక పత్రాన్ని అందించారు. కాగా శంకర్‌ కాసిపేట మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులుగా వున్నారు. ఈ సంధర్భంగా మండల సర్పంచ్‌లు శంకర్‌కు అభినందనలు తెలియ చేయగా, సర్పంచ్‌ ల సమస్యలపై అందరి సహకారంతో పరిష్కారినికి కృషి చేస్తానని, నాపై పెట్టిన బాద్యతను నెరవేరుస్తానని, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి మద్దతు తెలిపిన సర్పంచ్‌ లు, రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్‌ యాదవ్‌కు అభినందనలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement