Sunday, April 28, 2024

Utnoor: కష్టపడి చదవి కలలు సహకారం చేయాలి: జడ్పీ చైర్మన్

ఉట్నూర్, జూన్25 (ప్రభ న్యూస్) : విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు కలలు సహకారం చేయాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు ఆదివారం ఉట్నూర్ లోని బీసీ హాస్టల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, చెద్దర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు.

గతంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కు ధీటుగా నడుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మాజీ వైస్ ఎంపీపీ సలి మొద్దిన్, జీవవైవిధ్య మేనేజ్మెంట్ జిల్లా కమిటీ సభ్యులు మర్సుకొల తిరుపతి, మాజీ ఎంపీటీసీ సిద్దం రాజేశ్వర్, అబుజార్, దావుల రమేష్, అత్రం లక్ష్మణ్, రాజు, నర్సయ్య, శ్రీకాంత్, వార్డెన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement