Tuesday, April 30, 2024

Utnoor: జీసీసీ పెట్రోల్ బంకులకు గ్రహణం

ఉట్నూర్, జూన్ 25 (ప్రభ న్యూస్) : గిరిజన సహకార సంస్థ ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఐటిడిఏ సహకారంతో ఏజెన్సీ మండలాల్లోని ఉట్నూర్ జైనూర్, కెరమెరి, తిర్యాని మండలాల్లో పెట్రోల్ బంకులు ప్రారంభించారు. ఆ బంకులకు అనతి కాలంలోనే గ్రహణం పట్టి పట్టినట్లు అయింది. ప్రారంభించిన కొద్ది నెలలకే పెట్రోల్ బంకులు మూతపడ్డాయి.

ప్రభుత్వానికి పెట్రోల్ బంకుల నిర్వహణలో వ్యాట్ పన్నుల చెల్లింపులు, నిధుల లేమితో ఉట్నూర్ జీసీసీ సహకారంతో నడుస్తున్న జైనూర్ పెట్రోల్ బంకులు మూతపడి నెలలు గడుస్తున్నా పునర్ ప్రారంభానికి నోచుకోవడం లేదు. సంబంధిత ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement