Thursday, May 2, 2024

Asifabad : ఈవీఎం, వీవీ ప్యాట్ల భద్రతకు పటిష్ట చర్యలు : కలెక్టర్ హేమంత్ సహదేవరావు

ఆసిఫాబాద్ (ప్రభ న్యూస్) : ఎన్నికల నిర్వహణ కోసం ఉపయోగించే ఈవీఎం, వీవీ ప్యాట్ల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్స్ ను అదనపు కలెక్టర్ రాజేశం, ఆర్డీఓ రాజేశ్వర్ తో కలిసి వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎం, వీవీ ప్యాట్ల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈవీఎంలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.

రానున్న వారం రోజుల పాటు పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల పనితీరు పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈవీఎంల బ్యాటరీలను మార్చి వాటిని సిద్ధం చేయాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈవీఎంలు సిద్ధంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement