Thursday, May 2, 2024

రైతు సంక్షేమ ప్రభుత్వం బీఆర్ఎస్ : ఎమ్మెల్యే బాపురావు

తాంసి, జూన్ 12 (ప్రభ న్యూస్) : రైతుల సంక్షేమం కోరే ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. సోమవారం తాంసి మండలంలోని గిరిగామ గ్రామంలో 20 లక్షల నిధులతో నిర్మించనున్న నూతన గోదాం నిర్మాణానికి డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజరెడ్డి తో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో విత్తనాల కోసం లైన్ లో ఉండాల్సిన పని లేదని విత్తనాలను సైతం రైతుల వద్దకే వచ్చేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి,పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్,సి ఈ ఓ కేశవ్,సర్పంచ్ లు గజనన్, కృష్ణ,వెంకన్న,బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement