Tuesday, May 7, 2024

Delhi: నిన్ను వదలా.. చిన్నయ్యపై శేజల్ సీబీఐకి ఫిర్యాదు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరిజన్ డెయిరీ ఉద్యోగి శేజల్ సోమవారం సీబీఐకి ఫిర్యాదు చేశారు. దాదాపు పది రోజులకు పైగా ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్ న్యూఢిల్లీలోనే ఉంటున్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమె ధర్నాకు దిగారు. జాతీయ మహిళా కమిషన్ కు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరగడం లేదని ఆవేనదతో న్యూఢిల్లీలోనే ఆత్మాహత్యాయత్నం చేయడంతో.. వెంటనే ఆమెను స్థానికులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు.

ఆసుపత్రి నుండి ఇటీవలనే ఆమె డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్యపై సీబీఐకి కూడా శేజల్ ఫిర్యాదు చేశారు. శేజల్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తోసిపుచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని చిన్నయ్య గతంలోనే ప్రకటించారు. శేజల్ తాజాగా సీబీఐకి ఫిర్యాదు చేయడంపై దుర్గం చిన్నయ్య ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement