Monday, May 6, 2024

చెరువులో మురుగు నీరు.. ఆక్సిజన్ అందక చేపల మృతి

తాంసి : తాంసి మండలంలో బుధవారం భారీ వర్షం కురవడంతో మండలంలోని పొన్నారి గ్రామ సమీపంలో గల చెరువులోకి గ్రామంలోని డ్రైనేజీ చెత్త, మురికి చేరడంతో చెరువులోని చేపలు 5 టన్నుల వరకు ఊపిరాడక మృతిచెందాయని, ఇంకా మరణించే చేపల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిపారు.

మృతిచెందిన చేపల విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందన్నారు. గ్రామంలో గల మత్సకారులకు జీవనాధారమైన చెరువులో గల చేపలు మృతిచెందడంతో తమ ఆదాయాన్ని కోల్పోయామని.. ప్రభుత్వం తమను ఆదుకొని ఆర్థిక సహాయం అందించాలని పొన్నారి గ్రామ మత్స్యకారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement