Sunday, May 5, 2024

గుజ‌రాత్ గౌర‌వ్ యాత్ర‌లో కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్-ఆప్ పై ఫైర్

గుజ‌రాత్ గౌర‌వ్ యాత్ర‌లో కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. విమ‌ర్శ‌లు గుప్పించారు. గుజ‌రాత్ రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌రోసారి తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బిగ్గరగా మాట్లాడే ప్రజల పార్టీ అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుజరాత్ గౌరవ్ యాత్రలో పాల్గొనడానికి నేను ఈ రోజు మీ ముందుకు వ‌చ్చాను. ఈసారి రాష్ట్ర ప్రజలు మ‌ళ్లీ మాపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారని మాకు నమ్మకం ఉంది. వారిది గట్టిగా అరిచే వ్యక్తుల సమూహం (ఆప్)… వారి ఢిల్లీ మోడల్ అంటే ఏమిటి వారు నిజాయితీగా ఉంటే మిమ్మల్ని (మీడియా) ఢిల్లీకి తీసుకెళ్లాలి. అక్కడ అన్నీ చూపించాలి. ఏ బాధ్యతా లేని వ్యక్తులను చూసి నేను భయపడుతున్నాను. అది అలాంటి వ్యక్తులు ఉన్న గ్రూపు అని ప్రధాన్ అన్నారు. గుజరాత్ గౌరవ్ యాత్రను మెహసానా జిల్లాలోని బెచర్జీ పట్టణంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement