Monday, April 29, 2024

TS : గ్రామాలలో పోలీసుల కార్డాన్ సెర్చ్

చెన్నూర్, ప్రభన్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లోని బుద్దారం కన్నేపల్లి గ్రామాలలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం చెన్నూర్ టౌన్ సిఐ రవీందర్ అధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 21మోటర్ సైకిల్ లు, 3ఆటో లు, ఒక టాటా ఏసి లను తనిఖీ నిర్వహించి పత్రాలు లేని వాహనాలను స్టేషన్ కు తరలించారు.

- Advertisement -

అలాగే ఇరు గ్రామాలలో నీ గుడుంబా స్థావరాలను గుర్తించి దాడులు నిర్వహించి నాటుసారా తయారీకి ఉపయోగించే ముడిసరుకులు ధ్వంసం చేసి 15 లీటర్ల నాటుసారా, 10కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకావాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement